Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏం చేసుకుంటావో చేసుకో! : కమిడయన్ బెదిరింపు, నిర్మాత కోర్టు కి
చెన్నై:
కేవలం
తమిళవారికే
కాక
డబ్బింగ్
చిత్రాల
ద్వారా
తెలుగు
వారికి
సైతం
పరిచయమైన
కమిడియన్
సంతానం.
ఆయన
ఇప్పుడు
కోర్టు
సమస్యల్లో
ఇరుక్కున్నారు.
రీసెంట్
గా...
దిల్లుక్కు
దుడ్డు
చిత్రంతో
హీరోగా
మారిన
సంతానంకు
చెన్నై
సివిల్
కోర్టు
నోటీసులు
జారీ
చేసింది.
ఈయనతో
పాటు
చిత్ర
దర్శకుడు
రామ్బాలాకు
కూడా
నోటీసులు
అందాయి.
వివరాల్లోకెళితే... సంతానంపై పేపర్ ప్లైట్ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ముహమద్ మస్తాన్ సర్భూదిన్ చెన్నై 14వ సిటీ సివిల్కోర్టులో సంతానంపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ నోటీసులో ఆయన ఆవి పరక్క ఒరు కథ అనే పేరుతో తాను చిత్రం నిర్మించ తలపెట్టానని, దీనికి దర్శకుడిగా రామ్బాలాను ఎంపిక చేశానని పేర్కొన్నారు.
అంతేకాకుండా రామ్బాలాకు రూ. 11 లక్షల పారితోషికం మాట్లాడి మూడు లక్షలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు చెప్పారు. అలాగే చిత్రానికి హీరోహీరోయిన్లుగా నటుడు శివ,నటి నందితలను ఎంపిక చేసి వారికీ కొంత అడ్వాన్స్ చెల్లించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే షూటింగ్కు సిద్ధమైన తరుణంలో దర్శకుడు రామ్బాలా తనకు ఎలాంటి కారణం చెప్పకుండా రాలేదని తెలిపారు. నటుడు సంతానం హీరోగా నటించిన దిల్లుక్కు దుడ్డు చిత్రానికి రామ్బాలా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. తన కథతో ఆ చిత్రాన్ని తీశారనీ.. దీంతో తాను సంతానంకు ఫోన్ చేసి అడగ్గా చిత్రానికి రామ్బాలా దర్శకుడు కాదని చెప్పారన్నారు.
ఇటీవల దిల్లుక్కు దుడ్డు చిత్ర పబ్లిసిటీ పోస్టర్లలో దర్శకుడిగా రామ్బాలా పేరును వేశారని, ఈ విషయమై మళ్లీ సంతానంను అడగ్గా నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించారని చెప్పారు.కాగా తాను తన చిత్రం కోసం రూ. 81 లక్షల వరకూ ఖర్చు చేశానని..దిల్లుక్కు దుడ్డు చిత్రం విడుదలైతే తాను చాలా నష్టపోతానని లేఖలో తెలిపారు.
అందువల్ల చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసును శుక్రవారం విచారించిన చెన్నై 14వ సిటీ సివిల్ న్యాయమూర్తి గణపతిస్వామి నటుడు సంతానం,దర్శకుడు రామ్బాలాలను ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేసి కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.