Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రధాని మోదీని తప్పు పడుతూ గౌతమి సూటిగా విమర్శలు, స్పందిస్తారా?
ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు చేసారు గౌతమి.
చెన్నై: దక్షిణాది నటి,మాజీ స్టార్ హీరోయిన్ గౌతమి ...ప్రధాని నరేంద్ర మోదీ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తమిళనాడు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేయాలన్న డిమాండ్ తో సహా తమిళనాడులో ఏర్పడిన పలు సమస్యలపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని తప్పుపట్టింది.
గౌతమి ఈ మేరకు ప్రధానికి ఓ బహిరంగ లేఖ రాసింది. గతంలో రాసిన లేఖపై సమాధానం ఎందుకు ఇవ్వలేదని ఇందులో ప్రశ్నించింది. ఆ లేఖలో ...'డిజిటలైజేషన్ కు చాంపియన్ ను అని ప్రధాని మోదీ స్వయంగా చెబుతారు. అంతేగాక సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని దేశ ప్రజలకు చెబుతారు. అలాంటిది గతంలో నేను రాసిన లేఖకు మోదీ ఇంకా స్పందించలేదు. భారతదేశమంతా తనకు ఒకటేనని మోదీ భావిస్తే.. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులోని సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు?' అని గౌతమి లేఖలో పేర్కొంది.
జయలలిత మృతిపై వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, తమిళనాడుకు న్యాయం చేయాలని కోరింది. తమిళనాడును పలు సమస్యలు పీడిస్తున్నాయని, వీటిపై దృష్టిసారించి రాష్ట్రానికి న్యాయం చేయాలని విన్నవించింది.
జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో ఆమె ఆరోగ్యంపై సీక్రెసీ పాటించారని, సందర్శించేందుకు వచ్చిన ప్రముఖులకు ఆమెను చూపించలేదని, ఆమె ఆరోగ్యం, మృతిపై పలు సందేహాలున్నాయని గతంలో గౌతమి ప్రధానికి లేఖ రాసింది. పీఎంఓ నుంచి దీనికి సమాధానం రాకపోవడంతో ఆమె మరో లేఖ సంధించింది.