Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అమ్మ కష్టంలో ఉన్నపుడు ఎవరూ రాలేదు: విజయశాంతి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధిని దర్శించుకోవడానికి ఇటీవల విజయశాంతి చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ఆమె మీడియాతో మాట్లాడుతూ జయలలితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్: ఒకప్పుడు సినిమాల్లో స్టార్ హీరోయిన్గా, తర్వాత రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి....2014 ఎన్నికల తర్వాత వార్తల్లో కనిపించడమే లేదు. చాలా కాలం తర్వాత విజయశాంతి మీడియా కంట పడ్డారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధిని దర్శించుకోవడానికి ఇటీవల విజయశాంతి చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ఆమె మీడియాతో మాట్లాడుతూ జయలలితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలో జయలలిత మరణంపై నటి గౌతమి చేసిన ఆరోపణలపై మీడియా వారు ఆమెను కదిలించగా....ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు ఎవరు కూడా అమ్మ కష్టంలో ఉన్నప్పుడు రాలేదు, కష్టంలో ఉన్నప్పుడు నిలిచినవాళ్లే నిజమైన ఆప్తులు అంటాం. నాకు తెలిసి వీళ్లు ఎవరూ ఆమె కోసం రాలేదు . జైలుకి వెళ్లినప్పుడు, బాధలో ఉన్నప్పుడు రాలేదు. అలాంటి వారు ఇపుడు కొత్తగా మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
హాస్పటల్ లో సీసీ కెమెరాలు ఉంటాయి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి సెక్యూరిటీ కూడా భారీగా ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా కుట్ర జరిగిందని అనడం సరికాదు అన్నారు.