Don't Miss!
- News ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు పాడుతున్నాడు...డిటేల్స్
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు అమీన్(12) గొంతు త్వరలో మనం విననున్నాం. ఆ కుర్రాడు ఓ తమిళ చిత్రానికి గళం విప్పనున్నాడు. ఇప్పటికే ఓ హిందీ చిత్రంలో పాట పాడిన అమీన్ను తమిళంలోనూ తమ చిత్రాలకు పాట పాడించాలని గతంలో కొందరు దర్శకులు ఎ.ఆర్.రెహ్మాన్ను కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు.
ఇదిలా ఉండగా ఇదే విషయాన్ని దర్శకుడు మణిరత్నం కోరడంతో ఓకే చేశారట. 1992లో మణిరత్నం దర్శకత్వంలోని రోజా' చిత్రం ద్వారానే సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహ్మాన్ పరిచయమయ్యారు. ఆ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ కావడంతో పాటు మరికొన్ని హిట్లతో కోలివుడ్ అగ్ర సంగీత దర్శకుల జాబితాలో రెహ్మాన్ చేరారు.
తర్వాత బాలివుడ్, హాలివుడ్ చిత్రాలకు సంగీతం సమకూర్చి ఆస్కార్ అవార్డు పొందారు. ఈ సెంటిమెంట్తోనే మణిరత్నం దర్శకత్వంలోని చిత్రంలో అమీన్ను పాడించడానికి రెహ్మాన్ సుముఖత చూపినట్లు సమాచారం.
ఇక మణిరత్నం చేయబోయే చిత్రం ఓ ప్రేమ కథ అని తెలుస్తోంది. ఆ మధ్యన నాగార్జున, మహేష్ కాంబినేషన్ లో ఓ చారిత్రిక చిత్రం ఫ్లాన్ చేసిన ఆయన దాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఈ నేపధ్యంలో ఆయన తనదైన శైలిలో ఓ ప్రేమ కథను చిత్రీకరించి ఆకట్టుకోవాలనుకుంటున్నారు. ఆయన చివరి చిత్రం కడలి. భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.