Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'బాహుబలి' : క్షమాపణ చెప్పి,తొలిగిస్తానన్న డైలాగ్ రైటర్
చెన్నై : బాహుబలి తమిళ వెర్షన్ లో వాడిన కొన్ని పదాలు దళితలను కించపరిచేలా ఉన్నాయని వివాదం చెలిరేగిన సంగతి తెలిసిందే. అంతేకాదు తమిళనాడులోని మధురై వద్ద పెట్రో బాంబు సైతం ఈ విషయమై పేలింది. దళితులలో ఓ వర్గాన్ని కించ పరిచేలాగ ఉన్న ‘pagadai' అనే పదాన్ని ఉపసంహించుకోవాలంటూ కోరారు. సినిమాలోని ఓ కీలకమైన సన్నివేసంలో ఓ డైలాగులో ఈ పదం వస్తోంది.
ఈ సంఘటన జరగటంతో ...వెంటనే తమిళ మాటల రచయిత మదన్ కార్కే ...క్షమాపణను అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా తెలియచేసారు. "నేను మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్నా...నేను రాసిన ఓ డైలాగులోని ఓ పదం కొందరు మనో భావాలను దెబ్బ తీసిందని, ఆ పదాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను. ఆ పదం నేను కావాలని రాసింది కాదు. అలాగే అది ఓ కమ్యూనిటికి చెందిన పదమని కూడా తెలియదు. ఆ పదం ఉన్న డైలాగుని తొలిగిస్తున్నాం..ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించండి అన్నారు.
చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...
ఎస్.ఎస్.రాజమౌళి
దర్శకత్వంలో
ప్రభాస్,
రానా,
తమన్నా,
అనుష్క
ప్రధాన
పాత్రల్లో
వచ్చిన
ఈ
సినిమా
బాక్సాఫీస్
వద్ద
కాసుల
వర్షం
కురిపిస్తోంది.
రూ.100కోట్లు..
200..
300..
కోట్లు
దాటిపోయింది.
ప్రస్తుతం
బాహుబలి
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.355కోట్లు
వసూలు
చేసినట్లు
అంచనా.
ఇంకేముంది
రూ.500కోట్ల
కలెక్షన్
సినిమాలో
జాబితాలో
చేరేందుకు
దూసుకెళ్తోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అంతేకాదు బాలీవుడ్లో అధిక వసూళ్లు సాధించిన సినిమాలతో పోటీ పడుతోంది. జులై 17న విడుదలైన బాలీవుడ్ సినిమా 'భజరంగీ భాయీజాన్' ప్రపంచవ్యాప్తంగా రూ.226కోట్లు వసూలు చేసి ప్రస్తుతం బాహుబలికి గట్టి పోటీ ఇస్తోంది.
ఇక బాహుబలి సినిమా విడుదలైన తొలి రోజు నుంచే రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. జులై 10 శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన బాహుబలి ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.68కోట్ల షేర్ వసూలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డుగా చెప్తున్నారు.
బాలీవుడ్లో షారూక్ ఖాన్ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా తొలి రోజు రూ.65కోట్ల షేర్ సాధించినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ తొలిరోజు రికార్డులను బద్ధలు కొట్టేసింది.