Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ధనుష్ క్షమాపణ చెప్పాలంటూ కేబుల్ ఆపరేటర్స్ డిమాండ్
చెన్నై: తమిళ స్టార్ హీరో ధనుష్ తమకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ తమిళనాడు కేబుల్ టీవీ ఆపరేటర్స్ అశోసియేషన్ డిమాండ్ చేస్తోంది. దీనికి కారణం టాటా స్కై డిటిహెచ్ యాడ్. ఆ యాడ్ ని ధనుష్ చేయటమే.
టాటా స్కై యాడ్ లో ధనుష్... కొన్ని ఫాల్స్ ఛానెల్స్ చూపించి కేబుల్ ఆపరేటర్స్ డబ్బుని గుంజుతున్నారనే అర్దం వచ్చేలా చెప్తారు. దాంతో కేబుల్ ఆపరేటర్స్ జనరల్ సెక్రటరీ జి. దామోదరన్ మీడియాతో మాట్లాడుతూ...మేము పూర్తిగా ధనుష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆయన మమ్మలని ఇన్సల్ట్ చేసారు. క్షమాపణ చెప్పి యాడ్ ని వెనక్కి తీసుకోవాలి ." అన్నారు.
మరో ప్రక్క ఈ లోగా ధనుష్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి తమ ఆపరేటర్స్ కు క్షమాపణ చెప్పాలి లేదా ఆయన ఇంటి, ఆఫీసులు వద్ద నిరసన దీక్షలు,ధర్నాలు జరుగుతాయని హెచ్చరించారు.
అయితే ఈ విషయమై ధనుష్ మాత్రం ఏమీ స్పందించలేదు. ఆయన అభిమానులు మాత్రం ధనుష్ కేవలం టాటా యాడ్ డైరక్టర్ ఏమి చెప్పమన్నారో అదే చెప్పారు...అందులో తప్పేముంది అని వెనకేసుకు వస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ముగుస్తుందో చూడాలి.