Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీదేవి స్పెషల్ అప్పీరియన్స్...దేవిశ్రీప్రసాద్ సంగీతం
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తమిళంలో మళ్లీ తనేంటో చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా ట్యూన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ సినీ సంగీత సోయగం.. తమిళ ప్రేక్షకులను మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'సింగం', 'సింగం 2' చిత్రాలు దేవిశ్రీకి ఇంకాస్త గుర్తింపును తెచ్చిపెట్టాయి. సంక్రాంతికి వచ్చిన 'వీరం' మాస్ ఇమేజ్ను కూడా తెచ్చిపెట్టింది. అజిత్ చిత్రానికి తొలిసారిగా మంచి బాణీలను అందించారు. ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న 58వ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నారు.
శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్స్. అతిలోకసుందరం శ్రీదేవి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. పీరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ వైవిధ్యమైన బాణీలు అందిస్తున్నట్లు సమాచారం. గతంలో విజయ్, దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన 'సచిన్', 'విల్లు' చిత్రాలు మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు అదేస్థాయిలో స్వరాలు సమకూర్చుతున్నారట ఈ తెలుగుతేజం. తెలుగులోనూ సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
అలాగే హన్సిక....విజయ్ సరసన ఈ చిత్రంలో చేస్తోంది. ఆమె చేస్తున్న పాత్ర ఓ యువరాణి అని తెలుస్తోంది. ఈ విషయాన్ని హన్సిక స్వయంగా ట్విట్ ద్వారా ఖరారు చేసింది. ఇందుకోసం ఆమె కత్తి సాము వంటివి కూడా నేర్చుకుంటున్నట్లు ఉత్సాహంగా చెప్తోంది.
'ఇలయ తలబది' విజయ్ హీరోగా నటించిన 'కత్తి' ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం ఆయన శింబుదేవన్ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్నారు. దీనికి పలు పేర్లు పరిశీలించినా.. చివరకు 'గరుడ'ను ఎంచుకున్నట్లు తాజా సమాచారం. ఇందులో అలనాటి అందాల తార శ్రీదేవి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. విజయ్కి జంటగా శ్రుతిహాసన్, హన్సిక నటిస్తున్నారు.
ఇప్పటికే విజయ్, హన్సిక జోడీగా 'వేలాయుధం'లో సందడి చేశారు. చరిత్ర కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 'అపూర్వ సహోదరులు'లో కమల్ పోషించిన మరుగుజ్జు తరహా పాత్రలో ఆయన కనిపించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
హన్సిక రాణి పాత్ర పోషిస్తున్నారని.. ఆమెపై కత్తిసాము పోరాట సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఏ మేరకు విజయ్ అభిమానులను ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది విజయ్ 58వ చిత్రం. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
ఇక హన్సిక ఓ హీరోయిన్గా మాత్రమే మనకు తెలుసు. ఆమె ఓ పెయింటర్గానూ రాణించారనే విషయం చాలా మందికి తెలియదు. తమిళం, తెలుగు భాషల చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె సమయం ఉన్నపుడల్లా పెయింటింగులు గీస్తున్నారు. ఈమె రూపొందించిన కృష్ణా- రాధా పెయింటింగు రూ.15 లక్షలు పలికింది. ఇప్పటికే అనాధ పిల్లలను దత్తత తీసుకొన్న హన్సిక త్వరలో వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు పెయింటింగుల ద్వారా నిధులు సమకూర్చాలని నిర్ణయించారు. ఆమె గీసిన చిత్రాలతో త్వరలో ఓ ప్రదర్శన నిర్వహించనున్నారు.