Don't Miss!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- News వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Technology 8GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా, 6.67 అంగుళాల డిస్ప్లేతో Realme స్మార్ట్ఫోన్ విడుదల..తొలిసారిగా ఈ ఫీచర్లతో!
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
టీవీ యాంకర్ ని పెళ్లాడిన డైరక్టర్, నాగ్ సినిమాకు పనిచేసాడు
చెన్నై: రెండు రోజుల క్రితం నాగార్జున హీరోగా వచ్చిన 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ వివాహం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. తను ప్రేమించిన అమ్మాయిని విక్రమ్ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మరో డైరక్టర్ ఓ ఇంటివాడయ్యాడు. అయితే ఈ వివాహానికి నాగార్జునకు కూడా లింక్ ఉంది.
రీసెంట్ గా జోకర్ టైటిల్ తో తమిళంలో హిట్ కొట్టిన దర్శకుడు రాజు మురుగన్, టీవీ యాంకర్ హేమా సిన్హాలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 'కుక్కూ' చిత్రం ద్వారా కోలీవుడ్కు దర్శకుడు రాజు మురుగన్ పరిచయమయ్యారు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'జోకర్' భారీ విజయాన్ని సాధించింది.
అంతకు ముందు కార్తి, నాగార్జున నటించిన 'తోళా'(ఊపిరి) చిత్రానికి మాటలు కూడా సమకూర్చారు. తన చిన్ననాటి స్నేహితురాలు, ఓ టీవీ ఛానెల్ వ్యాఖ్యాత హేమను ప్రేమించి, ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు.
దర్శకుడు బాలా సమక్షంలో వీరి వివాహం చెన్నై, బిసెంట్ నగర్లోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో నిరాడంబరంగా జరిగింది. ప్రముఖ రచయిత మనుష్యపుత్రన్, పాటల రచయిత యుగభారతి తదితరులు పాల్గొన్నారు.
తమిళంలో పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ గా తెరకెక్కిన చిత్రం జోకర్. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గురు సోమసుందరం, గాయత్రి కృష్ణ, రమ్య పాండియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా మంచి హిట్టైంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది.