Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రూమర్సే... సినిమా లేదు...ఫ్యాన్స్ నిరుత్సాహం
'ఐ' షూటింగ్ లో బిజీగా ఉన్న శంకర్.. తదుపరి అజిత్ కోసం మంచి కథను సిద్ధం చేశారని,'రోబో' సీక్వెల్లో అజిత్ నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఆ విషయాలన్నింటినీ శంకర్ ఖండించారు.
ధనుష్ నటించిన 'వేలై ఇల్లా పట్టదారి' చిత్రాన్ని చూసిన శంకర్.. దానిపై తన అధికార ఫేస్బుక్ ఖాతాలో స్పందించారు. సినిమా చాలా బాగుందని, తనకెంతో నచ్చిందని ప్రస్తావించారు. ఈ తరుణంలో అజిత్ అభిమాని ఒకరు 'మా హీరో అజిత్తో సినిమా తీస్తున్నారట.. నిజమేనా?' అని ప్రశ్నించారు.
దీనిపై శంకర్ స్పందిస్తూ.. ప్రస్తుతం విక్రం హీరోగా నటిస్తున్న 'ఐ' చిత్రీకరణలో బిజీగా ఉన్నాను. ఆ సినిమా విడుదలయ్యేవరకు మరో ప్రాజెక్టు గురించి ఆలోచించ లేదు. అజిత్తో సినిమా అంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని చెప్పారు. ప్రస్తుతం 'ఐ' విడుదలయ్యాకే తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తానని తెలిపారు శంకర్.