Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఏ మతాన్ని కించపరచే సీన్స్ లేవు
చెన్నై: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం 'మెసెంజర్ ఆఫ్ గాడ్'. గుర్మిత్రామ్ రహీం సింగ్ ఇందులో కీలకపాత్ర పోషించారు. సంగీతంతోపాటు దర్శకత్వం కూడా ఆయన వహించారు. సెన్సార్బోర్డులో అధికారుల రాజీనామాకు కూడా దారి తీసిన ఈ చిత్రం పలు సమస్యలను దాటుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో సిక్కులను కించపరుస్తూ.. కొన్ని సన్నివేశాలను తెరకెక్కించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో పంజాబ్, హర్యానాలో ఈ సినిమాను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని కోరుతూ కొన్ని వర్గాలు కోర్టుల్లో వ్యాజ్యం దాఖలు చేశాయి. చివరకు ఈ అంశం అత్యున్నత న్యాయస్థానానికి చేరింది.
గుర్మిత్రామ్ రహీంసింగ్ మాట్లాడుతూ.. ఇందులో చర్చనీయాంశమైన అంశాలేవీ లేవు. ప్రధానంగా యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో మతాలను కించపరిచేందుకు అవకాశాలు లేవు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ చిత్రాన్ని చూసింది.
కొన్ని సన్నివేశాలను తొలగించి విడుదలకు మార్గం సుగమం చేసింది. తొలగించిన సన్నివేశాల వల్ల మేం చెప్పదలచుకున్న విషయాన్ని ఎలాంటి ఆటంకం కలగలేదు. ప్రపంచవ్యాప్తంగా వీలైనంత త్వరలో ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.