Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హాస్పటిల్ లో ఉన్న కమల్ వాయిస్ మెసేజ్
చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ రెండు రోజుల క్రితం తన ఆఫీస్ మెట్లు దిగుతుండగా కిందపడి గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో కమల్ కాలుకి సర్జరీ చేశారు. తాను త్వరలోనే కోలుకుని నడుస్తానని కమల్ అన్నారు. ఈ మేరకు ఆయన తన అభిమానులని ఉద్దేసించి ఓ వాయిస్ మెసేజ్ ని విడుదల చేసారు.
ఇది ప్రమాదం, బాధ కావచ్చు.. కానీ అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నాపై చూపించే ప్రేమకు మంత్రముగ్దుడ్ని అవుతున్నాను' అనే వాయిస్ మెసేజ్ను ప్రైవేటు ఆసుపత్రి నుంచి కమల్ పంపారు.
అలాగే 'నేను నిలబడగలుగుతున్నాను, త్వరలోనే నడుస్తాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు నాపై చూపిన అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాల్లో తెలియడం లేదు' అనికమల్ చెప్పారు.
కమల్హాసన్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రం తొలి షూటింగ్ షెడ్యూల్ లాస్ఏంజెల్స్లో ఇటీవల పూర్తైంది. ఈ చిత్రంలో కమల్ కుమార్తె శ్రుతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'దశావతారం'లో కమల్ నటించిన బలరాం నాయుడు పాత్రలో మళ్లీ ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. కమల్ చిన్న కుమార్తె అక్షరహాసన్ ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.