Don't Miss!
- News TTD: తిరుమల భక్తులకు శుభవార్త: లక్కీడిప్ డేట్స్ ఇవే; దర్శనానికి, సేవలకు, గదులకు త్వరపడండి!!
- Sports KKR vs RR: అందుకే తుది జట్టులో మార్పులు చేశాం: సంజూ శాంసన్
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Lifestyle రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
'పీకే' రికార్డును బ్రేక్ చేసింది
చెన్నై: గతంలో ఒకరోజులో అధిక వ్యూస్ వచ్చిన టీజర్గా అమీర్ఖాన్ నటించిన 'పీకే' చిత్రం రికార్డు సాధించింది. అయితే ఆ రికార్డును'ఇలయ దళపతి' విజయ్ నటించిన 'పులి' చిత్రం తిరగరాసింది. ఒక రోజులో 10 లక్షల కన్నా ఎక్కువ మంది అంటే ఇప్పటి వరకు ఈ టీజర్ను 12.5 లక్షల మంది వీక్షించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
శింబుదేవన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రం 'పులి'. శ్రీదేవి, హన్సిక, శ్రుతిహాసన్, సుదీప్ తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్లుక్, టీజర్ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర టీజర్ రికార్డు సృష్టిస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజీ వస్తోంది. చిత్ర హక్కుల కోసం పలువురు నిర్మాతలు పోటీపడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పోస్టర్లో విజయ్ మధ్యయుగానికి చెందిన వీరుడిలా కనిపిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదల చెయ్యనున్నారు.చింబుదేవన్(23 ఏఏఎమ్ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్, శృతి హాసన్, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ,టీజర్ ని విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరుగిపోయాయి.
చింబుదేవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఇది కాకుండా విజయ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ జిల్లా తెలుగు వెర్షన్ త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.
ఇక ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రోలో కనిపించనుంది. ప్రముఖ నటి శ్రీదేవి దక్షిణాదిన పునరాగమనం చేస్తున్న చిత్రర 'పులి'. చింబు దేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శింబు, శ్రుతి హాసన్, హన్సిక, సుదీప్ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్ చిత్రం 'ది గ్లాడియేటర్' పంథాలో ఈ సినిమా సాగుతుందట.
షిబు తమీన్స్ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.