Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పెళ్లికి రాలేదనే కోపంతో రజనీ, విజయ్ సినిమాలను నష్ట పరుస్తున్నారా?
చెన్నై: తమిళ స్టార్ విజయ్ నటించిన 'తేరి' చిత్రం ఇటీవల విడుదలై తమిళనాడు బక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే చెంగల్పట్టు, పరిసర ప్రాంతాల్లో 60 థియేటర్లలో మాత్రం విడుదల కాకపోవడంతో చిత్రానికి నష్టం వాటిల్లిందని మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో చిత్ర నిర్మాత కలైపులి.ఎస్. థాను విచారం వ్యక్తం చేశారు.
థియేటర్ల సంఘ కార్యదర్శి పన్నీర్ సెల్వం వల్ల కొన్ని సినిమాలకు ఏదో రూపంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అతని కూతురి పెళ్లికి రజనీకాంత, విజయ్ హాజరు కాలేదని, దాన్ని మనసులో పెట్టుకు నే ఇప్పుడు 'తెరి' విడుదల విషయంలో ఇబ్బంది పెట్టారన్నారు. రాబోయే 'కబాలి'కి కూడా ఏదో రూపంలో సమస్యని సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
'తెరి' చిత్రాన్ని సత్యం, ఐనాక్స్, పీవీఆర్ వంటి కొన్ని థియేటర్లలో విడుదల చేశాను. 'ఆ థియేటర్ల కి ఒప్పందం ప్రకారం వెళ్లిన మీరు మా దగ్గరకు అదే ఒప్పందంతో ఎందుకు రాలేదు' అని చెంగలప్పట్టు థియేటర్ యజమాను లు నన్ను ప్రశ్నించారు. నిజమే.. అక్కడున్న థియేటర్ల తరహాలోనే మీరూ థియేటర్లను కట్టించారు. అయితే మీతో ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం వచ్చిన వసూళ్లను మాకు సరి గా అందించడం లేదు కదా! అలాంటప్పుడు మీ ఒప్పందం ప్రకారం ఎలా నడుచుకోగలను?' అని కోపంగా ప్రశ్నించారు థాను.
'రామానుజం (థియేటర్ యాజమాన్య సంఘ మాజీ అధ్యక్షుడు) వంటి మనసున్న మేథావుల స్థానంలో ఇపుడు ఇలాంటి రౌడీలు వచ్చి కూర్చున్నారు. దీని వల్ల మాలాంటి నిర్మాత లు ఎంతో నష్టపోతున్నారు. మేమేమీ దోపిడీదారులం, హంతకులమో కాదని నిర్మాత కలైపులి థాను థియేటర్ల యజమానులపై విరుచుకుపడ్డారు. 'తెరి' విషయాన్నే తీసుకుంటే చెన్నైలో తొలి రోజే కోటి రూపాయిలు వసూలు చేసింది. సరైన ఒప్పందం ప్రకారం వెళ్లినా ఇబ్బంది పెట్టడానికి మేమేమీ దోపిడిదారులమో, హంతకులమో కాదు' అని కలైపులి.ఎస్.థాను వ్యాఖ్యానించారు.