Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ఘనత తెలుగువారికే,పూర్తి సహకారం: కమలహాసన్
చెన్నై: ఒకే భాష మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు, రెండు రాజధానులు ఉండటం గర్వకారణమని... ఆ ఘనత తెలుగు వారికే దక్కిందని ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ అన్నారు.
ఈరోజు ఆయన చెన్నైలో మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కమల్ కు ఆహ్వానం అందినా...అనివార్య కారణాల వల్ల ఆయన వెళ్లలేకపోయారు.
అలాగే..నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన హీరో విశాల్ టీమ్ కు ఎలాంటి సహకారం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని కమల్హాసన్ తెలిపారు.
ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. నడిగర్ సంఘంలో తమకు ఎలాంటి గౌరవ పదవులు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే నడిగర్ సంఘం పేరును అలాగే కొనసాగించాలని కమల్ హాసన్ సూచించారు.