Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కమల్ హాసన్ పాట పాడుతున్నాడు
చెన్నై: హీరోలు అంతా ఇప్పుడు పాటలు పాడుతున్నారు. అదే రూటులో కమల్ హాసన్ సైతం పాట పాడటానికి సిద్దమవుతున్నారు. అయితే ఆయన పాడే పాట ఆయన నటిస్తున్న చిత్రం కోసం కాదు. వీజే ప్రొడక్షన్స్ బ్యానరుపై నూతన దర్శకుడు విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'అవం' కోసం కావటం విశేషం.
ఈ చిత్రానికి చంద్రమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో హీరో ఒంటరితనం, ఆవేదనను చాటే ఓ గీతాన్ని ఆలపించే వారికోసం చిత్ర యూనిట్ వెతికింది. ఎంతో మందిని పరిశీలించాక.. 'విశ్వనటుడు' కమల్హాసన్ న్యాయం చేయలగలరని భావించింది.
ప్రముఖ గేయ రచయిత వైరముత్తు కుమారుడు మదన్కార్కి రాసిన ఆ పాటను పాడమని కమల్ను ఇటీవల దర్శకుడు కోరారు. చిత్ర ప్రాధాన్యతను గుర్తించిన ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఇందులో గౌరవ్ హీరోగా నటించారు. కావ్యాశెట్టి కథానాయిక. 'రాజా రాణి' ఫేం గుహన్ ఎస్.పళని సినిమాటోగ్రఫీ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ''కమల్ పాడితేనే ఆ గీతం బాగుంటుందని అనుకున్నాం. మా కోరికను మన్నించి ఆయన పాడారు. చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాట అందర్నీ హత్తుకునేలా ఉంటుంది''అని చెప్పారు.