Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగచైతన్యతో కాదు..కార్తీతో
చెన్నై: మణిరత్నం దర్శకత్వంలో చిత్రం గురించి గత కొంత కాలంగా తెలుగు,తమిళ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆ మధ్యన నాగచైతన్య, రానా లతో ఓ ప్రాజెక్టు ప్రారంబిస్తారని వినిపించింది. అయితే ఇప్పుడా ప్లాన్ మారిందని, తమిళ హీరో కార్తీ సీన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మొదట నాని,కార్తీలతో ఈ చిత్రం అనుకున్నారు. అయితే అది మెటీరియలైజ్ కాక నాగచైతన్య, రానా అనుకున్నారు. అయితే అదీ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు కార్తి ని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. మరి వేరే హీరోగా ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.
త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. బహుసా జూన్ నెలాఖరకు ఈ ప్రాజెక్టు మెటీరయలైజ్ కావచ్చు. ప్రేమమ్ లో చేసిన మళయాళి సాయి పల్లవి ని హీరోయిన్ గా కార్తీ సరసన మణి రత్నం ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సాయి పల్లవి ...చెన్నైలోని మణిరత్నం ఆఫీస్ మద్రాస్ టాకీస్ వచ్చి ఫొటో షూట్ లో పాల్గొందని సమాచారం. ఆమె ఫొటో షూట్ తో మణిరత్నం చాలా సంతృప్తి చెందినట్లు చెన్నై సినీ వర్గాలు చెప్తున్నారు. మొత్తానికి నాగచైతన్య ప్లేస్ లోకి కార్తి వచ్చాడన్నమాట.