Don't Miss!
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రజనీకాంత్ భార్యపై భారం పడనివ్వం
చెన్నై: రజనీకాంత్ హీరోగా నటించిన ‘కొచ్చాడయాన్' చిత్రం నిర్మాణం కోసం ఎగ్జిమ్ బ్యాంకునుంచి తీసుకున్న 20కోట్ల రూపాయల రుణాన్ని మార్చినాటికి చెల్లిస్తామని చిత్ర నిర్మాతలు మంగళవారం స్పష్టం చేశారు. ఈ రుణాల రికవరీకి నోటీసులు జారీ అయ్యే నేపథ్వంలో ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ రుణానికి గ్యారంటర్గా వున్న రజనీకాంత్ భార్యపై ఎలాంటి భారం పడనివ్వమని మీడియా1 గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థ తెలిపింది.
22.21కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్కు ఎగ్జిమ్ బ్యాంక్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రుణాన్ని చెల్లించని కారణంగా లతా రజనీకాంత్కు చెందిన రెండెకరాల ఆస్తిని ఎగ్జిమ్ బ్యాంకు జప్తు చేసుకున్నట్లుగా కూడా కథనాలు వచ్చాయి. తమకు సహకరించాలన్న ఉద్దేశంతోనే ఈ రుణానికి లతా రజనీకాంత్ గ్యారంటర్గా వున్నారని సంస్థ డైరెక్టర్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే...
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ సతీమణి లత పూచీకత్తుపై ఇచ్చిన కోట్లాది రూపాయల బకాయిలను వసూలు చేసుకునేందుకు ‘‘ఎగ్జిమ్'' ప్రైవేటు బ్యాంక్ నోటీసులు పంపింది. ‘కోచ్చడయాన్' చిత్రం కోసం మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్లో భాగస్వామిగా ఉన్న లతా రజనీకాంత్... రూ.20 కోట్ల రుణానికి పూచీకత్తుగా ఉన్నారు. ప్రస్తుతం ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ.22.21 కోట్లకు చేరింది.
గడువు ముగిసినా బకాయిలు చెల్లించని కారణంగా ఆమె ఆస్తులు వేలం వేయనున్నట్లు ఎగ్జిమ్ బ్యాంక్ నోటీసులు పంపింది. ఈ మేరకు వేలం ప్రకటనను పత్రికలో కూడా ముద్రించింది. 60 రోజుల్లోపు తమ బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో కాంచీపురం జిల్లాలో ఉన్న రజనీ కుటుంబానికి చెందిన ఆస్తులను వేలం వేస్తామని బ్యాంక్ ప్రకటించింది.
అయితే, పత్రికలో ప్రకటన వచ్చే వరకూ ఈ వ్యవహారం గురించి రజనీకాంత్కి కూడా తెలియదని సమాచారం. కాగా బ్యాంకుతో ఉన్న ఒప్పందం ప్రకారం వచ్చే మార్చి 31వ తేదీ వరకూ తమకు గడువు ఉందని మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రకటించింది. ఈ బకాయిలను చెల్లించే విషయమై ఇటీవల బ్యాంకు అధికారులతో కూడా పలు దఫాలుగా చర్చించామని, ఇచ్చిన గడువులోపు తాము మొత్తం రుణం చెల్లిస్తామని సంస్థ ప్రకటించింది.