Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నేషనల్ అవార్డ్ లిరిసిస్ట్ నా ముత్తుకుమార్ ఇక లేరు
చెన్నై: రెండు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ప్రముఖ తమిళ లిరిసిస్ట్ నా.ముత్తుకుమార్ ఇక లేరు. కొంతకాలంగా జాండీస్, హై ఫీవర్ తో బాధ పడుతున్న ఆదివారం కన్నుమూసారు. 41 ఏళ్ల వయసున్న ముత్తు కుమార్ కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ముత్తుకుమార్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ విషాద ఛాయలు అలుముకున్నాయి.
తమిళ సినీ పరిశ్రమలో ఆయన్ను అంతా 'కవి ఇలవరసన్' అని పిలుస్తుంటారు. తంగమీనకల్ సినిమాలో రాసిన 'ఆనంద యాజై' అనే పాటుకు గాను ముత్తు కుమార్ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. తర్వాత శైవం చిత్రంలో 'అఝగే అఝగే ఇతువమ్ అఝగే' అనే పాటకు గాను రెండో సారి జాతీయ అవార్డు అందుకున్నారు.
తన కెరీక్లో 1500లకు పైగా పాటలను తమిళ సినిమాలకు రాసారు. ఒక గొప్ప గేయరచయితను కోల్పోయామనే విషాదంలో తమిళ సినీ పరిశ్రమ మునిపోయింది. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.