Don't Miss!
- News హైదరాబాద్ సిటీలో వర్షం: అటు ఎండలు.. ఇటు వానలు
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాని-మణిరత్నం ప్రాజెక్టు ఆగటానికి కారణం
చెన్నై: మణిరత్నం రీసెంట్ గా ఓ భారీ మల్టి స్టారర్ ప్రాజెక్టుని తలపెట్టారు. అయితే అది మొదలవకుండానే ప్రారంభ స్దాయిలోనే ఆగిపోయినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టులో నానిని ఓ హీరోగా అనుకున్నారు. నాని ఈ ప్రాజెక్టు కోసం కొన్ని సినిమాలను సైతం వదులుకుని ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని కాస్టింగ్ సమస్యలతో ఈ ప్రాజెక్టు అర్దాంతరంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులో కార్తి, దుల్హర్ సల్మాన్, కీర్తి సురేష్, నిత్యా మీనన్ లను అనుకున్నారు. దుల్హర్ డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో నానితో పట్టాలు ఎక్కిద్దాముకున్నారు. అయితే కార్తీతో సమస్యల వల్ల సినిమా ఆగిందని అంటున్నారు. కొందరైతే అలాంటిదేమీ లేదు ..ప్రాజెక్టు పోస్ట్ ఫోన్ అయ్యిందంతే ఆగిపోయినట్లు కాదు అంటున్నారు. కానీ మణిరత్నం మాత్రం ధనుష్ తో సినిమా చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సౌతిండియాలోనే కాదు...ఇండియన్ బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో మణిరత్నం పేరును ప్రముఖంగా చెప్పుకొవచ్చు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి, రోజా, బొంబాయి, ఇద్దరు, సఖి, యువ లాంటి చిత్రాను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తు పల్లాలు ఉన్నట్లే మణిరత్నం కెరీర్లోనూ హిట్లు, ప్లాపులు ఉన్నాయి. అయితే హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. మణి సినిమా అంటే ప్రత్యేకంగా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో నటించాలని ప్రతి స్టార్ కోరుకుంటాడు.