Don't Miss!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మెస్మరైజ్: విలేజ్ అమ్మాయిగా ...నయనతారలుక్ (ఫొటో)
చెన్నై: నయనతార ఫ్యాన్స్ పండుగ చేసుకునే లుక్ రిలీజైంది. విలేజ్ అమ్మాయిగా నయనతార కనిపించి అందరినీ అలరించింది. 'ఈ' చిత్రం తర్వాత జీవా, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం 'తిరునాల్'. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. కుంభకోణం, సమీప ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మొరటుస్వభావమున్న గ్రామీణ యువకుడిగా ఇందులో నటిస్తున్నారు జీవా. లంగా, ఓణీతో గ్రామీణ అమ్మాయి పాత్ర పోషిస్తోంది నయనతార. తాజాగా విడుదలైన జీవా, నయనతార ఫొటోను చూసి చూడముచ్చట జంట అంటూ కితాబిస్తోంది కోలీవుడ్.
హాస్యం, యాక్షన్ కలగలిసిన ఈ సినిమా కోసం కుంభకోణంలో భారీ సెట్ను ఏర్పాటు చేశారు. ఈ సెట్లో వెయ్యి మందికిపైగా జూనియర్ ఆర్టిస్టులతో కలిసిన కీలక సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. కోదండపాణి ఫిలిమ్స్ బ్యానరుపై సెంథిల్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమా గురించి దర్శకుడు బీఎస్ రామనాథ్ మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత జీవా వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. గ్రామీణ యువకుడిగా ఆయన నటనకు ప్రేక్షకులు, అభిమానులు తప్పకుండా బ్రహ్మరథం పడతారు. ఇక నయనతార జోడీ కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. శ్రీ సంగీతం సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రఫి మహేష్ ముత్తుస్వామి, ఎడిటింగ్ వీటీ విజయన్, ఆర్ట్ శను. స్టంట్ సూపర్ సుబ్బరాయన్.
ఈ రోజు నయనతారది మరొకటి
అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఆరి, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం 'మాయా'. దీని చిత్రీకరణ పనులు ముగిసిన నేపథ్యంలో తుది విడత పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల నేపథ్యంలో ఇది ప్రేక్షకుల్లో పలు అంచనాలకు తెర లేపింది.
చిత్రం ట్రయలర్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో గురువారం ట్రయలర్ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 'మాయా' చిత్రానికి రాన్ యోహాన్ సంగీతం సమకూర్చగా ఫొటోగ్రఫీ సత్యన్ సూర్యన్.రోబో శంకర్, లక్ష్మీ ప్రియ, అంజద్ఖాన్ తదితరులు ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
నయనతార మరికొన్ని చిత్రాల్లో నటిస్తుండగా వాటిలో 'నానుం రౌడిదాన్' చిత్రీకరణ పనులు ముగిశాయి. ప్రస్తుతం ఆమె కార్తిక్ జంటగా 'కాష్మోరా' చిత్రంలో నటిస్తున్నారు.