Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కానీ అది అసంభవం: తేల్చి చెప్పిన రాజమౌళి
చెన్నై: 'మహాభారతం' తెరకెక్కించాలనే ఉంది కానీ అది అసంభవం అంటూ తేల్చి చెప్పారు రాజమౌళి. ఈ ప్రాజెక్టు వచ్చే టెక్నికల్ సమస్యలు గురించి ఆయన మాట్లాడారు.
'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు రాజమౌళి. తన కలల ప్రాజక్టు 'మహాభారతం' అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ విషయం గురించి ఇటీవల ఐఐటీ మద్రాసు విద్యార్థులతో ముచ్చటించినప్పుడు కాస్త విపులంగా మాట్లాడారు.
రాజమౌళి మాట్లాడుతూ...''మహాభారతం' కథను సినిమాగా తీయాలని ఉంది. అయితే దీని కోసం పదేళ్లు కష్టపడాలి. ఒకవేళ ఆ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చితే నాలుగు భాగాలుగా తీస్తాను. కానీ ఈ సినిమాకు ప్రధాన ఇబ్బంది నటీనటులు దొరకడం. కనీసం ఆరేళ్లపాటు వారు తమ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది అసంభవం''అని చెప్పారు రాజమౌళి. ఒకవేళ అలా సుదీర్ఘంగా డేట్లు ఇచ్చే స్టార్ ఎవరో చెప్పండంటూ రాజమౌళి విద్యార్థులనే ప్రశ్నించారు.
ఇక కొద్ది రోజుల క్రితం... డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి సృష్టించిన వండర్ బాహుబలి 100 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓ సంఘటన అందరినీ మరోసారి ఈ సనిమా గురించి గుర్తు చేసేలా చేసింది. రీసెంట్ గా ...తమిళనాడు వెల్లూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో విద్యార్దులకు బాహుబలి ప్రశ్నలు ఇచ్చారు.
వాళ్ళ ప్రస్నాపత్రాన్ని చూసి షాక్ అయ్యారు. బాహుబలి 2 కు చెందిన వార్ సీక్వెన్స్ కు చెందిన ఇంజనీరింగ్ సెట్స్ డిజైన్ చేయమని ఆ పేపరులో ఉంది. వాళ్లు డౌట్ తో తమ ప్రొఫిసర్ ని ఈ విషయమై ప్రశ్నించారు. ఆయన మీరు చూసింది కరక్టే అని ఖరారు చేసి చెప్పారు. రెండు ప్రశ్నలు..తలో పది మార్కులతో ఈ విషయమై ఉన్నాయి.
భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.
చైనాలో 'బాహుబలి'
ఇప్పుడు ఇతర దేశాల్లోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. చైనాలో 'బాహుబలి'ని 5000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు చిత్రాన్ని ఎడిట్ చేశారు. పలు చలన చిత్రోత్సవాలకీ పంపుతున్నారు. చైనాలో ఈ చిత్రం నవంబరు నుంచి సందడి చేయబోతోంది. అక్కడ 'పీకే' చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్స్ ఫిలిమ్స్ సంస్థనే 'బాహుబలి'ని విడుదల చేస్తుండడం విశేషం.
'పీకే'కి చైనాలో మంచి ఆదరణ లభించింది. అదే తరహాలో 'బాహుబలి' కూడా చైనా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.