Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రజనీ వార్నింగ్ వర్కవుట్ అయ్యింది, లాభం రెట్టింపు
చెన్నై: రజనీకాంత్ వరస ఫెయిల్యూర్స్ లింగ, విక్రమ సింహా ప్రబావంతో ఈసారిచాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆయనే అన్ని విషయాలు సమన్వయం చేసుకున్నారు. అందులో భాగంగా బడ్జెట్ కంట్రోలు పెట్టి సక్సెస్ అయినట్లు సమాచారం.
గతంలో రజనీచిత్రం అంటే వంద కోట్లు పెట్టుబడి పెట్టేవారు. అయితే ఈ సారి చాలా స్ట్రిక్టుగా దాన్ని 70 కోట్లుకు కుదించినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం బిజినెస్ పరంగా ఇప్పుడు రెట్టింపు లాభాలు చూసిందని కోలీవుడ్ టాక్. కబాలి ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు అయినట్లు సమాచారం. దాంతో నిర్మాత పూర్తి ఆనందంగా ఉన్నారు.
లింగా వివాదాలు, విక్రమ్ సింహా వివాదాలతో విసుగెత్తిన రజనీ ఇలా నిర్ణయం తీసుకుని తనపై జూదం ఆడద్దని హెచ్చరించినట్లు సమాచారం. తక్కువ బిజినెస్ అయినా రేపు సినిమా అటూఇటూ అయితే పెద్దగా నష్టపోయేదమీ ఉండదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదట ఈ విషయమై నిర్మాత విభేధించినా తర్వాత లాభ,నష్టాలు, పెట్టుబడలను బేరీజులు వేసుకుని దానికి తగినట్లే బిజినెస్ చేసినట్లు చెప్తున్నారు. పి.ఎ రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ డాన్ గా కనిపించనున్నారు. ఆయన సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా చేస్తోంది.