Don't Miss!
- Technology వన్ప్లస్ 12R స్పెషన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. బ్యాంకు ఆఫర్ల ద్వారా ధర తగ్గింపు..!
- Sports IPL 2024: ‘నా గుండె పగిలింది’ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం!
- Finance Layoff News: యూనీలివర్ 7,500 ఉద్యోగుల కోత.. పూర్తి వివరాలివే..
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- News Plume: భారత్ లో అంతర్జాతీయ సంస్ధ ప్లూమ్ తొలి ఆఫీసు ప్రారంభం- ప్రత్యేకతలివే..!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
సూపర్ స్టార్ అభిమానులూ..! ఇంక పండగచేస్కోండి
ఇంతకుముందు లాగే అభిమానులని కలవటానికి ఒక రోజుని కేటాయించాలనుకున్న రజినీ ఏర్పాటు చేయాలనుకున్న అభిమానులతో కలయిక అనే కార్యక్రమాన్ని వాయిదా వేసి నట్లు ప్రకటించారు.అయితే మళ్ళీ ఏమనుకున్నరో ఏమో గానీ అభిమానుల
ఇదివరకు సూపర్స్టార్ రజనీ కాంత్ను ఆయన అభిమానులు ఇంతకు ముందు తరచూ కలిసేవారు. తరచు ఇలాంటి సమావేశాలు, మీట్ లూ జరుగుతూ ఉండేవి. అభిమానులకోసమే ఒక రోజు మొత్తం కేటాయించే వాడు రజినీ, అయితే ఆ తర్వాత అభిమానుల తాకిడి ఎక్కువ అవటం, ఆ ప్రాంతం లో ట్రాఫిక్ సమస్యలే కాక రజినీ ఆరోగ్య రీత్యా కూడా అలాంటి ప్రోగ్రాములు తగ్గించే వేస్తూ వచ్చి తర్వాత మొత్తంగా ఆపేసారు.
10 ఏళ్లు కావస్తోంది
అలాంటి సమావేశం జరిగి 10 ఏళ్లు కావస్తోంది. మధ్యలో రజనీకాంత్ తన అభిమానులను కలవాలని భావించినా అనివార్యకారణాల వల్ల కుదరలేదు. ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ రజనీకాంత్ రాష్ట్రంలోని నలుమూలలకు చెందిన అభిమానుల్సి చెన్నైకి ఆహ్వానించి మంచి విందునిచ్చి వారితో ఫొటోలు దిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసాడు.
గతం లో లాగా
మళ్ళీ గతం లో లాగా అభిమానులతో కలిసి ఫొటోలు దిగటానికి కేటాయించాలకున్నారు. అయితే దాని పరిణామం మామూలుగా ఉండదని తర్వాత అర్థమయ్యింది. అయితే అభిమానులు విడివిడిగా తమ అభిమాన నటుడితో ఫొటోలు దిగాలని ఆశపపడ్డారు, అది సహజమైన కోరికే అయినా ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 15 వేల మందితో నిర్ణయించిన తేదీలో విడివిడిగా ఫొటోలు దిగడం సాధ్యం కాదని అర్థమైపోయింది...
మళ్ళీ ఏమనుకున్నరో ఏమో
దాంతో రజనీకాంత్ ఈ అభిమానులతో కలయిక అనే కార్యక్రమాన్ని వాయిదా వేసి నట్లు ప్రకటించారు.అయితే మళ్ళీ ఏమనుకున్నరో ఏమో గానీ అభిమానులకోసం ఆ ఇబ్బందిని భరించటానికే సిద్ద పడ్డాడు. తాజాగా మరోసారి అభిమానులతో కలవడానికి రజనీకాంత్ కొత్తగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు, బహుశా మే నెల మూడో వారంలో గానీ, జూన్లో గానీ ఆ కార్యక్రమం ఉంటుందని సమాచారం.
అభిమానులు మాత్రమే
అయితే ఈ కార్యక్రమంలో అభిమానులు మినహా ఇతరులెవరికీ అనుమతి ఉండదని సమాచారం. మొత్తానికి పదేళ్ళ తర్వాత జరగబోతున్న ఈ మీట్ రజినీ అభిమానులకు ఒక పండగ లాంటిదే అనుకోవచ్చు. ఒక్క తమిళనాడునుంచే కాదు దేశం నలుమూలల్లో అన్ని చోట్లనుంచీ రజినీ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు వాలిపోవటానికి సిద్దంగా ఉన్నారు ఫ్యాన్స్.