Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విడాకుల కోసం కోర్టుకు రజనీకాంత్ కూతురు.. పొలిటికల్ ఎంట్రీకి ముందు..
సూపర్స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య తన భర్త అశ్విన్తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. గత కొద్దికాలంగా సౌందర్య దంపతుల మధ్య విభేదాల నెలకొన్న సంగతి తెలిసిందే.
సూపర్స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య తన భర్త అశ్విన్తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. గత కొద్దికాలంగా సౌందర్య దంపతుల మధ్య విభేదాల నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టుకు సౌందర్య హాజరయ్యారు. అశ్విన్తో సౌందర్య వివాహం 2010లో జరిగింది. సౌందర్య, అశ్విన్రే వేద్ అనే కుమారుడు ఉన్నాడు. వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో గతేడాది విడిపోవాలని వారు నిర్ణయించుకున్నారు. రజనీ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో కుటుంబంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంపై అభిమానుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సౌందర్య, అశ్విన్ దంపతుల విడాకుల కేసు విచారణను కుటుంబ న్యాయస్థానం శుక్రవారం విచారించింది. తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించినా దంపతులిద్దరూ ఉమ్మడి అంగీకారంతో విడిపోతున్నామని కోర్టుకు పేర్కొన్నట్టు తెలిసింది. వచ్చే విచారణలోపు దంపతులిద్దరూ విడిపోవడానికి గల కారణాలు సవివరంగా తెలుపుతూ, ఉమ్మడి అంగీకారంతో కూడిన ఓ మోమోను ఇద్దరు సమర్పించాలని కోర్టు సూచించింది. దంపతులిద్దరితో సంప్రదింపుల అనంతరం వారి మెమోతో సంతృప్తి చెందితే చట్టబద్ధంగా విడిపోయేందుకు కోర్టు విడాకులు మంజూరు చేయనున్నది. ఈ ఉమ్మడి అంగీకార పత్రంలో భరణం వివరాలు, పిల్లాడి సంరక్షణ బాధ్యతలు తదితర అంశాలు ఉండే అవకాశం ఉంది.