Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డబ్బు గుంజడానికే నాపై దావా వేసారు: రజనీకాంత్
హైదరాబాద్: సినీ ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రాపై సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన నుండి డబ్బు గుంజడానికే తనపై దావా వేసారంటూ ఆయన మండి పడ్డారు. తన వియ్యంకుడు కస్తూరి రాజా రూ. 65 లక్షలు ముకుంద్ బోత్రా వద్ద అప్పగా తీసుకున్నారని, ఆ అప్పుకు తాను హామీదారుగా లేక పోయినా తన నుండి ఆ డబ్బు వసూలు చేయడానికి దావా వేసారని తెలిపారు.
అయితే ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా వాదన మరోలా ఉంది. రజనీకాంత్ వియ్యంకుడు కస్తూరి రాజా 2012లో ఓ సినిమా విషయమై తన వద్ద ఒకసారి 40 లక్షలు, మరోసారి 25 లక్షలు అప్పుగా తీసుకున్నారని.... తాను డబ్బు చెల్లించక పోతే తన కుమారుడు ధనుష్ మామగారైన రజనీకాంత్ చెల్లిస్తాడని చెప్పారని, అందుకే దావా వేసారని తెలిపారు.
ఈ కేసులో కోర్టు పంపిన నోటీసులకు రజనీకాంత్ పై విధంగా సమాధానం ఇచ్చారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. తన ప్రమేయం లేకున్నా తన పేరు చేర్చి తన పరువుకు నష్టం కలిగించారని రజనీకాంత్ పేర్కొన్నారు.