Don't Miss!
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
రిజెక్ట్: నన్ను కొడితే ఫ్యాన్స్ తట్టుకోలేరన్న రజనీకాంత్
హైదరాబాద్: మళయాలంలో సూపర్ హిట్టయిన దృశ్యం చిత్రాన్ని ఆ తర్వాత తెలుగులో, హిందీలో రూపొందించిన సంగతి తెలిసిందే. తెలుగులో వెంకీ చేయగా, హిందీలో అజయ్ దేవగన్ చేసారు. తాజాగా తమిళంలో కమల్ హాసన్ హీరోగా ఈచిత్రాన్ని ‘పాపనాశనం' పేరుతో రీమేక్ చేసారు.
వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్తో చేయాలనుకున్నారట. అయితే సినిమాలో పోలీసులు హీరోను తీవ్రంగా కొట్టే సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని కూడా తీవ్రంగా హింసిస్తారు. ఈ రెండు అంశాల కారణంగానే రజనీకాంత్ ఈ చిత్రాన్ని తిరస్కరించారట. తనను బాగా కొట్టడం చూసి అభిమానులు తట్టుకోలేరని, అందువల్ల ఫలితాలు సరిగా రాక పోవచ్చని రజనీకాంత్ చెప్పారట. ఈ విషయాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ స్వయంగా వెల్లడించారు.
కాగా... తమిళంలో కమల్ హాసన్, గౌతమి నటించిన ‘పాపనాశనం' చిత్రం ఇటీవల విడుదలై మంచి ఓపెన్సింగ్ సాధించింది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.