Don't Miss!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పంజా దర్శకుడి చిత్రంలో...నాగార్జున, రవితేజ!
తమిళ స్టార్ హీరో అజిత్, పంజా దర్శకుడు విష్ణువర్ధన్ కాంబినేషన్లో వస్తున్న తమిళ చిత్రం ఇప్పుడు తెలుగు నాట చర్చనీయాంశం అవుతోంది. మల్టీస్టారర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే నయనతార, ఆర్య, తాప్సి లీడ్ రోల్స్లో ఎంపికయ్యారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మన తెలుగు స్టార్స్ నాగార్జున, రవితేజలు కూడా దర్శనం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈచిత్రంలో 'రోజా' ఫేం అరవింద స్వామి ఓ ముఖ్య పాత్రలో ఖరారు కాగా...విష్ణువర్ధన్ టీం తాజాగా నాగార్జున, రవితేజ, జగపతిబాబులను అతిథి పాత్రల కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
శ్రీ సత్యసాయి మూవీస్ బేనర్పై ఎఎం రత్నం ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా...పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా, ఎడిటర్గా శ్రీకార్ ప్రసాద్, మాటల రచయితగా సుభా, ఆర్ట్ డైరెక్టర్గా సునీల్ బాబు, కాస్టూమ్ డిజైనర్గా అనువర్ధన్ పని చేయనున్నారు. మే 31న ముంబైలో ఈచిత్రం తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది.