Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాహబలి 'కట్టప్ప'... ఇప్పుడు 'దొర'
హైదరాబాద్ : బాహుబలి చిత్రంలో కట్టప్పగా కనిపించి అలరించిన సత్యరాజ్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ఇప్పుడు తెలుగులోనూ విడుదల అవుతోంది. సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్, బింధుమాధవి జంటగా రూపొం దుతున్న తమిళ చిత్రం 'జాక్సనదురై'. ధరణీ ధరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'దొర' పేరుతో రత్న సెల్యూలాయిడ్ పతాకంపై జక్కం జవహర్బాబు తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. సత్యరాజ్ కీలకపాత్రలో కనిపిస్తారు.
జవహర్బాబు మాట్లాడుతూ ''పీరియాడికల్ హారర్ చిత్రమిది. దొరగా, దెయ్యంగా సత్యరాజ్ పాత్ర ఆకట్టుకుంటుంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై పెద్ద హిట్టైంది. శిబిరాజ్ నటిస్తున్న ఈ తమిళ సినిమాలోను సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శిబిరాజ్, బింధు మాధవి హీరో హీరోయిన్లుగా.. ధరణి ధరన్ దర్శకత్వంలో జాక్సన్ దురై అనే సినిమా తెరకెక్కుతోంది. కొడుకు శిబిరాజ్ నటిస్తున్న 'జాక్సన్ దురై'లో సత్యరాజ్ పోషిస్తున్న పాత్రే ఇప్పుడు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది.
విశేషం ఏమంటే.... ఇందులో దెయ్యంగా కనిపించనున్నాడట సత్యరాజ్. క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సత్యరాజ్ ఒక్కసారిగా ఘోస్ట్ గా నటిస్తుండడంతో ఈ సినిమా పై కోలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు. ఈ సినిమాలో సత్యరాజ్ క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారట దర్శక నిర్మాతలు.
హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న జాక్సన్ దురై లో కేవలం మూడు పాటలే ఉంటాయట. మరి దెయ్యంగా మారబోతున్న సత్యరాజ్ జనాలను ఎలా భయ పెడతాడో చూడాలి.