Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అభిమాని ఆత్మహత్యాయత్నంపై శింబు స్పందన...
చెన్నై: తమిళ నటుడు శింబు నటించిన ‘వాలు' తమిళ చిత్రం వివిధ సమస్యలతో విడుదల కావడం లేదు. తమిళ సీని పరిశ్రమలో శింబు సినిమా విడుదల కాకుండా కుట్ర జరుగుతోందని ఆయన తండ్రి రాజేంద్రన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సినిమా ఆలస్యం కావడాన్ని తట్టుకోలేని శింబు అభిమాని ఒకరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు.
ఈ సంఘటనపై శింబు స్పందిస్తూ...ఈ సంఘటన నన్ను ఎంతో బాధించింది. దయచేసి ఎవరూ ఇలాంటివి చేయొద్దు. అభిమానులు శాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమా విడుదల ఆలస్యం కావడంతో తాను కూడా నిరాశలో ఉన్నానని, అయితే అభిమానుల అండతోనే ధైర్యంగా ఉన్నట్లు తెలిపాడు.
శింబుపై కుట్ర జరుగుతోందని, తన చిత్రాన్ని విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారని నటుడు, నిర్మాత అయినత టి.రాజేంద్రన్ ఆందోళన వ్యక్తం చేసారు. ‘వాలు' చిత్రాన్ని జులై 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. కానీ మళ్లీ వాయిదా పడింది. ఈ చిత్రానికి విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు, హన్సిక, సంతానం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.