Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నెక్ట్స్ తెలుగులో వస్తున్న సూర్య సినిమా ‘మేము’(ట్రైలర్)
హైదరాబాద్: తమిళ హీరో సూర్య నటిస్తున్న తమిళ చిత్రం ‘పసంగ-2' తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘మేము' పేరుతో తెలుగులో విడుదలవున్న ఈ చిత్రంలో సూర్య కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నారు. ఇదొక బాలల చిత్రం. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
సూర్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాండిరాజ్ చెప్పిక కథ నచ్చడం వల్లనే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మొదట్లో తమిళంలోనే విడుదల చేయాలనుకొన్నారు. కానీ సూర్య - అమలాపాల్ లకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే తెలుగులోనూ సినిమాని విడుదల
చేస్తున్నారు.సినిమా సందేశాత్మకంగా ఉండటంతో పాటు కలర్ ఫుల్ ఉంటుందని, కేవలం పిల్లలకే కాదు పెద్దలకీ నచ్చుతుందని అంటున్నారు. ప్రయోగాత్మకంగా, సందేశాత్మకంగా ఉండే సినిమాలు తీయడానికే సూర్య స్వయంగా టుడీ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓన్ ప్రొడక్షన్ కంపెనీ స్థాపించాడు. ఆ ప్రొడక్షన్ కంపెనీలో తొలి ప్రయత్నంగా చేసిన 36 వయదినిలే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
గతంలో పాండి రాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ బాలల చిత్రం ‘పసంగ' మంచి విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా వస్తున్న ‘పసంగ-2' చిత్రం కూడా మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నారు.