Don't Miss!
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
టాప్ డైరక్టర్ , ఆయన కుమార్తె పై చెక్ బౌన్స్ కేసు
చెన్నై : ప్రముఖ తమిళ సినీ దర్శకుడు చేరన్, ఆయన కుమార్తె నివేద ప్రియదర్శిలపై పరమకుడి కోర్టులో చెక్కు బౌన్స్ కేసు దాఖలైంది. ఈ నెల 30వ తేదీ ఆ ఇద్దరు న్యాయస్థానంలో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
వివరాల్లోకి వెళితే చేరన్ ఆయన కుమార్తె నివేద ప్రియదర్శినిలు 'సీ2హెచ్' క్యాసెట్ల విక్రయ సంస్థను నిర్వహిస్తున్నారు. పరమకుడి, పార్తిబనూర్, ముత్తుకుళత్తూరు, కముది, అభిరామం తదితర ప్రాంతాల్లో క్యాసెట్ల విక్రయ హక్కులను పళముత్తునాథన్ పొందారు. ఇందుకోసం ఆయన సీ2హెచ్కు రూ.80 వేల డిపాజిట్ చెల్లించారు.
ఆ సంస్థ నిర్వహణ తీరు సరిగాలేదని భావించిన ఆయన తన డిపాజిట్ను తిరిగి చెల్లించాలని కోరగా అతడికి చేరన్, ప్రియదర్శినిలు జూన్ 27న చెక్కు ఇచ్చారు. అది జులై 10న బ్యాంకులో జమ చేయగా డబ్బులు లేక బౌన్స్ అయింది.
దాంతో పళముత్తునాథన్ పరమకుడి కోర్టులో చేరన్ ఆయన కుమార్తె నివేదపై చెక్కు బౌన్స్ కేసు దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి ఇన్బకార్తికేయన్ చేరన్, ప్రియదర్శినిలు ఈ నెల 30వ తేదీ న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించారు.