Don't Miss!
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఛీటింగ్ కేసులో సినీ నిర్మాత అరెస్టు
చెన్నై: భాగస్వామ్యం ఆశ చూపించి రూ.48 లక్షల మేరకు మోసం చేసిన కేసులో సినీ నిర్మాతను నగర పోలీసులు అరెస్టు చేశారు. పుదుకోట్త్టె జిల్లా కె.పుదుపట్టి గ్రామానికి చెందిన సెంథిల్బాబు (31) ఇటీవల చెన్నై నెర్కుండ్రానికి చెందిన సినీ నిర్మాత గణేశన్పై నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'విసయం వెళియ తెరియకూడాదు నాసుక్కా చెయ్యనుం' అనే సినిమాను ప్రముఖ దర్శకుడు, మరికొంత మంది సహకారంతో నిర్మిస్తుండగా ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయిందని, పెట్టుబడి పెడితే లాభాల్లో 47 శాతం ఇస్తానని గణేశన్ తనను నమ్మించాడని తెలిపారు.
దీంతో రూ.48 లక్షలు ఇవ్వగా... సినిమా విడుదలైన తర్వాత తిరిగి చెల్లించకపోవడంతోపాటు లాభం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనరు రాజేంద్రన్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం గణేశన్ను మంగళవారం అరెస్టు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పుళల్ జైలుకు తరలించారు.