Don't Miss!
- News లోక్సభ ఎన్నికల తర్వాత గందరగోళమే: ఉద్యమ కేసీఆర్ను చూస్తారంటూ బీఆర్ఎస్ అధినేత
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వేశ్య పాత్రలో మరో ముద్దుగుమ్మ
చెన్నై : వేశ్య పాత్రలో నటించటానికి హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. తాజాగా 'పోడా పోడీ' ద్వారా కోలీవుడ్కు పరిచయమైన నటి వరలక్ష్మి. 'సుప్రీంస్టార్' శరత్కుమార్ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఈ అమ్మడు.. దుమ్మురేపే డాన్స్తో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత నృత్యానికి సంబంధించిన కథలకే ఈ ముద్దుగుమ్మ ఓకే చెబుతోంది. విశాల్ సరసన ఆమె నటించిన రెండో చిత్రం 'ఎంజీఆర్' ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు.
మరోవైపు భిన్న చిత్రాలతో ఆకట్టుకునే దర్శకుడు బాలా... వరలక్ష్మి ప్రతిభకు తగ్గట్టు తన 'తార తప్పటై'లో అవకాశమిచ్చారు. ఇందులో ఆమె 'కరగాట్టం' కళాకారిణిగా నటిస్తోంది. ప్రథమార్థంలో నృత్య కళాకారిణిగా... ద్వితీయార్థంలో వేశ్య పాత్రలో నటిస్తోందని విశ్వసనీయ సమాచారం. ప్రారంభంలో ఈ పాత్రపై అనాసక్తి చూపించినా.. తన సీనియర్ నటీమణులను దృష్టిలో ఉంచుకుని సరేనందట అమ్మడు.
సినిమాలో ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో నటించాక.. తన కెరీర్పై నమ్మకం పలు రెట్లు పెరిగిందని సన్నిహిత వర్గాలతో ఆమె పేర్కొందట. తన చిత్రాలతో జాతీయ అవార్డుల అంశంలో ముందు వరుసలో ఉంటే బాలా.. ఈ సారి కూడా ఈ చిత్రం ద్వారా పురస్కారాలను అందుకుంటారని విశ్లేషకులు అంటున్నారు.