Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
వంద కోట్లు హీరోను... రాజకీయాల్లోకి రాకుండా దెబ్బతీస్తున్నారా?
చెన్నై: తమిళనాట హీరో విజయ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలకు రూ. 100 కోట్లు వసూలయ్యే సత్తా ఉంది. విజయ్ నటిస్తున్న 'తేరి' చిత్రం రేపు(ఏప్రిల్ 14) విడుదలకు సిద్దం అవుతున్న తరుణంలో కొత్తగా సమస్యలు వచ్చి పడ్డాయి.
ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని ప్రదర్శించబోమంటూ థియేటర్ యజమానులు ప్రకటించడంతో విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సినిమా థియేటర్లలో అధిక టిక్కెట్ ధరలపై హైకోర్డు కొరఢా ఝుళిపించిన నేపథ్యంలో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్ర్టిబ్యూటర్లు తమతో మళ్లీ ఒప్పందం చేసుకుంటేనే సినిమా ప్రదర్శిస్తామని...టికెట్ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ముందుగా అనుకున్న ఫైనాన్షియల్ ఒప్పందం ప్రకారం విడుదల చేయలేమని, అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెన్నై, చెంగల్పట్టులోని సింగిల్, డబుల్ థియేటర్ యజమానులు ప్రకటించారు.
అయితే థియేటర్ల ఓనర్లు ఉన్నట్టుండి ఇలా మెలికి పెట్టడం వెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వానికి, విజయ్కి కొంతకాలంగా పడటం లేదనే వాదన ఉంది. ఈ కారణంగానే ఆయన సినిమాల విడుదల సమయంలో ఏదో ఒకరకంగా ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తూ తెర వెనక రాజకీయం నడిపిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
విజయ్ గత చిత్రాలు'తలైవా', 'పులి' చిత్రాల విడుదల సమయంలోనూ ఇబ్బంది పెట్టారు. ఇపుడు 'తేరి' విషయంలో కూడా అదే జరుగుతోంది. తేరి తర్వాత విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం కూడా కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకే ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారనే వాదన కూడా ఉంది.
"తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసుకుని, U సర్టిఫికేట్ ను దక్కించుకుంది. 'రాజా రాణి' చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి.భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.
విజయ్ , సమంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.