Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిజాయితీ బ్రతికే ఉంది... మిస్సైన, నిశ్చితార్థ ఉంగరం దొరికింది!
చెన్నై: తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమార్తె అక్షిత తన ఎంగేజ్ మెంట్ రింగ్ పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ నిశ్చితార్థ ఉంగరాన్ని ఎట్టకేలకు చేజిక్కించుకుంది. దాంతో విక్రమ్ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకీ ఆ రింగ్ ఎలా దొరికిందంటే...
పూర్తి వివరాల్లోకి వెళితే...డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్ తో...కొద్ది కాలం క్రితం అక్షిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే స్నేహితులతో కలిసి చైన్నైలోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లిన అక్షిత.. చేతి వేలికి ఉంగరం లేకపోవడం గమనించింది.
వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించడం, అనుమానితులను ప్రశ్నించడంలాంటివి చేసినప్పటికీ ఉంగరం జాడ తెలియలేదు.అయితే తాజాగా లక్ష్మణన్ అనే ఓ క్యాబ్ డ్రైవర్.. అక్షిత ఉంగరాన్ని తెచ్చి ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిశ్చితార్థ ఉంగరం పోయిందని వార్తా పత్రికల్లో చదివిన లక్ష్మణన్, తనకు దొరికిన ఉంగరం అదేనని తెలుసుకుని వెంటనే విక్రమ్ ఫ్యామిలీకి అందజేసినట్లు సమాచారం. గాంధీ ఫౌండేషన్ లో లక్ష్మణన్ సభ్యుడిగా ఉన్నాడు. కాగా ఆ ఉంగరం విలువ రూ.12 లక్షల పైమాటేనట.