Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొదటిదే రిలీజ్ లేదు..అయినా ఇంకోటి
చెన్నై : సుందర్.సి, విశాల్ కాంబినేషన్లో ఇప్పటికే తెరకెక్కిన చిత్రం విడుదలకు నోచుకోని నేపథ్యంలో తాజాగా మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. కొంతకాలం పాటు నటుడిగా కొనసాగిన సుందర్.సి మళ్లీ మెగాఫోన్ పట్టుకుని కొన్ని హిట్ చిత్రాలు రూపొందించారు. విశాల్ హీరోగా, వరలక్ష్మి, అంజలి ఆయనకు జంటగా 'మదగజరాజా'ను రూపొందించారు. చిత్రీకరణ పూర్తెనా.. అనివార్య కారణాలతో విడుదలకు నోచుకోలేదు.
ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో 'ఆంబళ' అనే చిత్రం రూపొందనుంది. విశాల్కు జంటగా హన్సిక ఆడిపాడనుండగా.. ప్రభు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. యువన్ శంకర్రాజా స్వరాలు సమకూర్చుతారు. విశాల్కే చెందిన విశాల్ ఫిలిం ఫ్యాక్టరి ఈ సినిమా నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
విశాల్ మాట్లాడుతూ '' నాన్న, అన్నయ్య స్థాపించిన నిర్మాణ సంస్థలు ఉన్నప్పటికీ నేను నిర్మాతగా మారానంటే కారణం అదే. ప్రతీ హీరోకీ ఓ మలుపు ఉంటుంది. ఆ మలుపు దర్శకుడితోనే వస్తుంది. ఈ కథ చెప్పినప్పుడు నా సినీ జీవితానికి మలుపునిచ్చే చిత్రమిదే అవుతుందనిపించింది. ''అన్నారు.
తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాను. నిర్మాతగా మారడంతో ఆ సినిమా ఆలస్యమైంది. శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న తెలుగు సినిమాని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నాము అన్నారు.