Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిజా నిజాలు నాగార్జునకే ఎరుక
హైదరాబాద్: ఆయన మాటీవి ఛానెల్ కి యజమాని. అయితే ఆయన సినిమాలకు బిజినెస్ మాత్రం జీ,జెమినీ ఛానెల్ చేస్తూంటాయి. ఆయన ఎవరూ అంటే నాగార్జున. నాగార్జున నటించిన చిత్రాలు భాయ్ ...శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వారు సొంతం చేసుకుంటే, ఇప్పుడు మనం శాటిలైట్ రైట్స్ ని జెమినీ వారు తీసుకున్నారు. అయితే మా టీవి మాత్రం ఎందుకు ఆ శాటిలైట్ రైట్స్ ఎందుకు ఇవ్వలేదని అంతటా చర్చించుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం...తమ్ముడు తమ్ముడే...పేకాట పేకాట అన్నట్లు ఎవరు తన సినిమాలకు శాటిలైట్ రైట్స్ ఎక్కువ ఆఫర్ చేస్తే వారికే ఇవ్వటం జరిగింది. మా టీవీ కన్నా ఆ ఛానెల్ వారే ఎక్కువ ఆఫర్ చేసారు కాబట్టి వారికే ఇచ్చేసారు అని అంటున్నారు. అయితే నిజానిజాలేమిటి అన్నది నాగార్జున మాత్రమే తేల్చి చెప్పాలి.
ఇక ప్రస్తుతం నాగార్జున బుల్లితెరపై మెరస్తున్నారు. 28 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో ద్వారా డ్రాయింగ్ రూమ్లో వీక్షకులను పలకరిస్తున్నారు. జూన్ మొదటివారం నుంచి 'మా' టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్పురి భాషల్లో ఇప్పటికే విజయవంతమైన 'కౌన్ బనేగా కరోడ్పతి' ఫార్ములాతోనే ఈ గేమ్ షో రూపొందింది.
మాటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో పాల్గొనే అవకాశం అందరికీ కలిపిస్తున్నారు. హాట్ సీన్ చేరుకొని తమ అభిమాన హీరో నాగార్జునతో ఆడాలనుకున్నవారు మాటీవీలో ప్రసారమవుతున్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని పంపి రిజిష్టర్ చేసుకోవచ్చు. ప్రసారమైన ఏడు ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సమాధానం ఎస్ఎంఎస్ చేసినా హాట్ చేరుకొనే అవకాశం దక్కవచ్చు. అంతేకాదు జీవితాన్ని మార్చేసే కోటి రూపాయల బహుమతిని కూడా అందుకోవచ్చు.
మాటీవీ ఈ పోటీని అత్యంత విశ్వసనీయమైన పద్ధతుల్లో నిర్వహిస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో ఈ షో సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. బిగ్ సినర్జీ ఈ కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. కోటి రూపాయల బహుమానం అందించే ఈ షోలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుంది. కోటి రూపాయలు గెలుచుకోవాలన్న కలని ఎవరైనా నిజం చేసుకోవచ్చునే ఆలోచనతో ఆరంభమైంది 'మీలో ఎవరు కోటీశ్వరుడు'.
ఈ షోని మాటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నాలెడ్జ్ షో అత్యంత ఆసక్తికరంగా సాగుతూ, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు విలక్షణమైన వినూత్నమైన వినోదాన్ని అందించబోతోంది. జీవితం సంధించే వంద ప్రశ్నలకు ఒకటే జవాబు- అదే, మీలో ఎవరు కోటీశ్వరుడు.