Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా టీవీ యాంకర్ మృతి
వాషింగ్టన్: ప్రముఖ అమెరికన్ టీవీ యాంకర్, మోడల్ పీచెస్ జెల్డోఫ్ అధిక మోతాదులో మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో మరణించినట్లు బ్రిటిస్ పోలీసులు ధృవీకరించారు. 25 ఏళ్ల పీచెస్ జెల్డోఫ్ ఏప్రిల్ 7వ తేదీని అకస్మాత్తుగా మరణించింది. దాదాపు నెల రోజుల తర్వాత ఆమె మరణం వెనకగల నిజాలు వెలుగులోకి వచ్చాయి.
టాక్సికాలజీ రిపోర్ట్స్ ప్రకారం ఆమె మొతాదుకు మించి హెరాయిన్ తీసుకున్నట్లు గుర్తించారు. హెరాయిన్ కారణంగానే ఆమె శరీరంలో తీవ్రమైన మార్పులు జరిగి మరణం సంభవించినట్లు వైద్యులు గుర్తించారు. జెల్డోఫ్ ప్రముఖ మ్యూజీషియన్ మరియు కాంపెనీయినర్ బోబ్ జెల్డోఫ్ రెండో కుమార్తె.
పీచెస్ జెల్డోఫ్ తల్లి పౌలా యేట్స్ కూడా అధికంగా హెరాయిన్ అనే డ్రగ్ తీసుకోవడం వల్ల 41వ ఏట మరణించింది. పీచెస్ జోల్డోఫ్ భర్త థామస్ కోహెన్. వీరికి 2 ఏళ్ల వయసున్న ఆస్టాలా, ఒక సంవత్సరం వయసున్న పీయద్రా అనే కుమారులు ఉన్నారు. 23 ఏళ్ల కోహెన్తో పీచెస్ జెల్డోఫ్ వివాహం జరిగింది.
పీచెస్ జెల్డోఫ్ బ్రతికి ఉండగా చివరగా చూసిన వ్యక్తి కోహెన్ ఫాదర్ కెయిత్. పీచెస్ జోల్డోఫ్ కుమారుడు పీయద్రాను డ్రాఫ్ చేయడానికి వచ్చినపుడు ఆమె మరణానికి ముందు రోజు రాత్రి చూసాడు. ఆ తర్వాతి రోజు ఉదయం ఆమె కాంటాక్టులోకి రాక పోవడంతో అనుమానం వచ్చిన భర్త తన తల్లి ఇంటికి పంపగా పీచెస్ జోల్డోఫ్ మరణించి కనిపించింది.