Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నదిలో మునిగిపోయి మృతి చెందిన టీవీ ఆర్టిస్టు
ముంబై: ప్రముఖ హిందీ టీవీ నటుడు మోహిన్ ఖాన్ నదిలో మునిగి చనిపోయారు. స్నానానికి వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం సరిహద్దులోని తైఫీ వద్ద గల జియాభరాలి నదిలో అతడు మంగళవారం సాయంత్రం మునిగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
సరదాగా స్నానం చేయటానికంటూ నదిలోకి దిగిన మోహిన్ అది పూర్తయ్యాక ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేరాలని అనుకున్నాడు. అయితే ఊహించని విధంగా ... వేగంగా ఓ అలలాంటి ప్రవాహం రావడంతో నీటిలో మునిగి గల్లంతయ్యారని వివరించారు.
హిందీలోని పలు టీవీ కార్యక్రమాల్లో మోహిన్ నటించాడు. అంతేకాకుండా ఆయన స్వయంగా నిర్మాత కూడా. ఇతడికోసం తొలుత గజ ఈతగాళ్లు, అనంతరం ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి గాలింపులు చేపట్టినా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.
ఓ నేషనల్ చానెల్ తరుపున డాక్యుమెంటరీ చిత్రం తీసేందుకు మొత్తం ఐదుగురు సభ్యుల బృందంతో ఈ ప్రాంతానికి మోహిన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ వాతావరణ భద్రతకు సంబంధించినదని తెలుస్తోంది.