Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫుల్ గా తాగి,మత్తులో టీవి నటిపై లైంగిక దాడి, పోలీస్ కంప్లైంట్
బెంగళూరులోని ఓ బార్లో జరిగిన గొడవలో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఒకరు బుల్లితెర నటిపై దాడికి యత్నించిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది.
బెంగళూరు: తాగిన మైకంలో చేసే చిల్లర పనులు ఒక్కోసారి పెద్ద ఇబ్బందులనే కొని తెచ్చిపెడుతూంటాయి.తాజాగా బెంగళూరులోని ఓ బార్లో జరిగిన గొడవలో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఒకరు టీవి నటిపై దాడికి యత్నించాడు. దాడి ఘటనపై నటి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు యూబీ సిటీ 17వ అంతస్ధులోని స్రైబార్లో ఆదివారం రాత్రి ఫుల్ గా తాగిన కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు తీవ్రంగా గొడవపడి తిట్టడంతో పరస్పరం కొట్టుకున్నారు.
వాళ్లు మొత్తం ఏడుగురు. వాళ్ళలో ..బుల్లితెర నటి నిరూషా కూడా ఉంది. ఓ దశలో పీకలదాకా తాగిన పారిశ్రామికవేత్త కుమారుడు దర్శన్ ...నిరూషాపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో స్నేహితులతో కలిసి కబ్బన్పార్క్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన నిరూషా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే మత్తు దిగిన దర్శన్ చేసిన తప్పుకు క్షమించాలని కోరుతూ నిరూషాకు లేఖ రాయడంతో కథ అక్కడితో ముగిసింది. నిరూషా కూడా దర్శన్పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది. అడపాదడపా స్కైబార్లో ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.