Don't Miss!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టీవీ షో (వీడియో)
హైదరాబాద్: బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సూపర్ హిట్ హిందీ టీవీ కార్యక్రమం 'కౌన్ బనేగా కరోడ్ పతి' తెలుగు వెర్షన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగు కార్యక్రమానికి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే పేరుతో సాగే ఈ కార్యక్రమం ఏఫ్రిల్ 18వ తేదీ నుండి మాటీవీలో మొదలు కానుంది.
హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో 'మీలో కోటీశ్వరులు ఎవరు' కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ద్వారా....నాగార్జున మంచి ఫ్యాన్సీ ఎమౌంట్ ని రెమ్యునేషన్ గా వసూలు చేస్తున్నట్లు చెప్తున్నారు. మాటీవిలో తనకు షేర్స్ ఉన్నా రెమ్యునేషన్ విషయంలో రాజీ పడలేదని తెలుస్తోంది. నలభై ఎపిసోడ్స్ కి గానూ మూడు కోట్లు వరకూ తీసుకుంటున్నారని టీవి వర్గాల సమాచారం.
మరో వైపు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా సినిమాలు నిర్మించడంతో పాటు....పలు తెలుగు సీరియల్స్ను కూడా నిర్మిస్తున్నారు. సీరియల్స్ నిర్మాణంలో మంచి లాభాలు ఉండటంతో నాగార్జున ఈ రంగంలోకి దిగారు. "పసుపు కుంకుమ'' "పుట్టింటి పట్టుచీర'' "శశిరేఖా పరిచయం'' వంటి సీరియల్ష్ ఆయన నిర్మిస్తున్నారు.
<center><iframe width="100%" height="390" src="//www.youtube.com/embed/ZhjWjHlRJX0" frameborder="0" allowfullscreen></iframe></center>