Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కన్నడంలో మళ్లీ ఎస్పీ బాలసుబ్రమణ్యమే
బెంగళూరు : ఈటీవీ కన్నడలో బుల్లితెర వీక్షకుల్ని ఉర్రూతలూగించిన 'ఎదెతుంబి హాడువెను' (మన పాడుతా తీయగా తరహా పోగ్రాం) కార్యక్రమం మళ్లీ మీముందుకు వస్తోంది. ఈటీవీ కన్నడ న్యూస్ఛానల్లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఛానల్ ముఖ్యుడు ఆర్.సుబ్బానాయుడు బెంగళూరులో ప్రకటించారు. వీక్షకుల విన్నపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. చెవులారా నవ్య సంగీత ధ్వనులను ఆస్వాదించాలనే వారికి మరో పండుగే అన్నారు.
బాలల్లో దాగిన గానమాధుర్యాన్ని వెలికితెచ్చే ఈ విశిష్ట కార్యక్రమం ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇందులో పాల్గొనాలంటే 9-12 ఏళ్ల వయస్సున్న బాలలు అర్హులు.
ప్రతీ ఎపిసోడ్కు సంగీత, సినీ రంగానికి చెందిన ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఎంపిక ప్రక్రియ ఈనెల 17 నుంచి ప్రారంభిస్తారు. బెంగళూరులోని గాంధీభవన్లో 17, 18 తేదీల్లో, మైసూరులో- 19, హాసన్లో 20, మంగళూరులో 21, దావణగెరెలో 22, హుబ్లి-ధార్వాడలో 23న ఎంపికను నిర్వహిస్తారు.
ఇందులో పాల్గొనాలని ఆసక్తి ఉన్న బాలలు 9342456699 నెంబర్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం.. మీ నగరంలో ఏర్పాటయ్యే ఎంపిక ప్రక్రియలో పాల్గొని ఎంచక్కా మీ ప్రతిభను చాటుకోండి అంటున్నారు నిర్వాహకులు.