Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
మీలో ఎవరు కోటీశ్వరుడు: ఆ మొత్తం దానం చేసాడు!
హైదరాబాద్: నాగార్జున హోస్ట్ గా మాటీవీలో ప్రసారం అవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల నుండి ఈ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల ఈ షోలో పాల్గొన్న ఓ 60 సంవత్సరాల వ్యక్తి తాను గెలిచిన 25 లక్షలను స్వచ్ఛంద సంస్థలకు దానం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన రావణ శర్మ అనే వ్యక్తి తను గెలిచిన రూ. 25 లక్షల్లో రూ. 20 లక్షలు స్వచ్ఛంద సంస్థల పేరుపై ఫిక్డ్స్ డిపాజిట్ చేసారు. మిగిలిన 5 లక్షలు తాను కష్టాల్లో ఉన్న సమయంలో సహాయం చేసిన ఒక మాతృమూర్తి పేరిట ఫిక్డ్స్ డిపాజిట్ చేసాడు. రావణ శర్మ గతం..... ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు విని షో చూస్తున్న ప్రేక్షకులు చలించిపోయారు.
కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కొన్నేళ్ల క్రితం ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిలో స్థిరపడ్డారు. ఆయన ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు అప్పలు, ఇతర అవసరాలకు ఖర్చు అయిపోయాయి. అయినవారు ఆదరించక పోవడంతో స్నేహితుల సహాయంతో ఒంటరి జీవితం సాగిస్తున్నరు. తన టాలెంటుతో మీలో ఎవరు కోటీశ్వరుడులో అవకాశం దక్కించుకున్న శర్మ....తనకు వచ్చిన రూ. 25 లక్షల్లో... 10 లక్షలు శ్రీవిద్యా సెంటర్ ఫర్ మెంటల్లీ రిటార్టెడ్ పర్సన్స్ సంస్థకు, మరో రూ. 10 లక్షలు నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ సంస్థపేరిట డిపాజిట్ చేసారు.