twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూ ఇయిర్ స్పెషల్: నాగ్,సమంత కలిసి..(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ :నాగార్జున,సమంత కలిసి గతంలో మనం చిత్రం చేసారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ రియాలిటీ షోలో పాల్గొననున్నారు. అది మరేదో కాదు...మీలో ఎవరు కోటీశ్వరుడు. ఈ రోజు(డిసెంబర్ 31) రాత్రి 11 గంటలకు మా టీవిలో ప్రసారమయ్యే ఎపిసోడ్ లో న్యూ ఇయిర్ స్పెషల్ గా సమంత పాల్గొని అలరించనుంది. ఈ మేరకు టీజీర్ ని సైతం విడుదల చేసారు. ఆ టీజర్ ని మీరు చూడండి...

    అక్కినేని నాగార్జున బుల్లితెరపైకి అరంగేట్రం చేస్తూ చేసిన రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షో హిందీలో బాగా ఫేమస్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి షోకి రీమేక్ వెర్షన్. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా నాగార్జున తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో రికార్డ్ రేటింగ్స్ సాధించింది.

    నాగార్జున హోస్టుగా మా టీవీలో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌లతో దూసుకుపోతున్న షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' . ఇప్పుడు సెకండ్‌ సెషన్‌ ప్రారంభమయ్యింది. డిసెంబర్‌ 8 నుంచి ప్రారంభం మయిన ఈ షోలో హీరో నితిన్‌ అతిధిగా వచ్చారు. ఫస్ట్‌ సెషన్‌ మధ్య మధ్యలో పలువురు స్టార్స్‌ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే రెండో సీజన్లో కూడా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు.

    Samantha

    ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈ అండ్ వై) పర్యవేక్షణలో ఎంట్రీలను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత దశగా 1500 మంది నుంచి 100 పోటీదారులను ఎన్నుకున్నట్లు మాటీవీ తెలిపింది. ఈ షోలో నాగార్జున అడిగే 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా కంటెస్టెట్ కోటి రూపాయలు గెలుచుకోవచ్చు.

    English summary
    On New Year eve, Sam will be seen flaunting her jovial side as she plays “Meelo Evaru Koteeswarudu” that is hosted by King Nagarjuna. On December 31st night at 11 PM, this special New Year episode of the game show will be aired.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X