Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టీవీ కమెడియన్తో శృతి హాసన్ డ్యూయెట్ సాంగ్
ముంబై: కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తొలుత సింగర్ గానే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నటిగా మారి తన టాలెంటు నిరూపించుకుంది. నటిగా కొనసాగుతూనే సింగర్గా అప్పుడప్పుడు సినిమాలకు పాటలు సైతం పాడుతోంది. అల్లు అర్జున్తో కలిసి నటిస్తున్న 'రేస్ గుర్రం' చిత్రంలో ఓ పాట కూడా పాడింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శృతి హాసన్ హిందీ టీవీ కామెడీ షో 'కామెడీ నైట్స్ విత్ కపిల్' నటుడు కపిల్ శర్మతో కలిసి ఓ పాట పాడబోతున్నారట. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈ వెంటులో శృతి హాసన్, కపిల్ శర్మ కలిసారు. ఈ క్రమంలో సింగింగ్, మ్యూజిక్ పట్ల ఇద్దరి అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఓసాంగు పాడాలని నిర్ణయించుకున్నారట. సుఖ్విందర్ సింగ్ ఈ పాటను కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
శృతి హాసన్కు సంబంధించిన సినిమాల వివరాల్లోకి వెళితే....ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం 'రేస్ గుర్రం' షూటింగ్ ఇటీవలే పూర్తయింది. దీని తర్వాత ఆమె తన నెక్స్ హిందీ మూవీ ప్రాజెక్ట్స్ 'వెల్ కం బ్యాక్', 'గబ్బర్' చిత్రాల్లో నటించనుంది. కపిల్ శర్మ త్వరలో 'బ్యాంక్ చోర్' అనే చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.