Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2000 వేల కోట్లకు, ఛానెల్ ని అమ్మకానికి పెట్టిన జీ టీవి
డిల్లీ: ఛానెళ్లు కొనుగోళ్లు, అమ్మకాలు, ఇండియన్ టెలివిజన్ రంగంలోనూ చాలా కామన్ విషయాలుగా మారుతున్నాయి. పెద్ద ఛానెల్స్ లాభసాటి బేరాలకు కొత్త ఛానెల్స్ ని తమలో కలుపుకోవటం, భారం అనిపించే ఛానెల్స్ ని అమ్మేయడం చేస్తున్నాయి.
తాజాగా ఇండియా మీడియా రంగంలో మరో భారీ అమ్మకానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జడ్ఈఈఎల్) టెన్ స్పోర్ట్స్ ఛానల్ను వెల్లడించిన ధరకు అమ్మకానికి పెట్టింది. ఈ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు జీ సంస్థ బీఎస్ఈకి తెలిపింది.
కాగా ఛానళ్లను ఎవరికి విక్రయిస్తున్నారనేది మాత్రం రహస్యంగా ఉంచింది. దీనికి సంబంధించిన ఆర్థిక వివరాలను సైతం సంస్థ వెల్లడించలేదు.
టెన్ స్పోర్ట్స్ను రూ.2000 కోట్లకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దుబాయ్కి చెందిన అబ్దుల్ రహ్మాన్ తాజ్ గ్రూప్ నుంచి టెన్స్పోర్ట్స్ను జీ సంస్థ 2006లో కొనుగోలు చేసింది.