Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తెలుగు టీవీ సీరియల్ నిర్మాత మృతి...ఆందోళన
హైదరాబాద్: కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన టెలివిజన్ సీరియల్ నిర్మాత పీ శంకర్ బుధవారం సాయత్రం మృతిచెందాడు. సకాలంలో వైద్యం అందలేదని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శంకర్ మృతి చెందినట్లు ఆరోపిస్తూ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట్కు చెందిన పీ శంకర్ (37) కొన్ని సీరియళ్లకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా,ఛానెల్ కు నిర్మాతలకు మధ్య వారధిగానూ వ్యవహరించారు. మొగలి రేకులు, గోరంత దీపం సీరియల్స్ కు ఆయన పనిచేసారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
శంకర్కు తీవ్ర కడుపునొప్పి రావటంతో బుధవారం అతన్ని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శంకర్కు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించి, స్లైన్ ఎక్కించారు. మూడుగంటలపాటు శంకర్కు వైద్యం అందించిన తర్వాత పరిస్థితి విషమించిందని చెప్పారు.
నగరంలోని మరో ఆస్పత్రికి తరలించాలని చెప్పడంతో ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి శంకర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. శంకర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.