Don't Miss!
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- News నీ భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఉంది, ఫ్రెండ్స్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భర్తకు ఆఫర్ !
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఇలా జరగటం ఇదే తొలిసారి: టీవి ప్రీమియర్ షోల విషయంలో బాలయ్య చిత్రం కొత్త రికార్డ్
సంక్రాంతి పండక్కి విడుదలైన నందమూరి బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' మాటీవిలో ఉగాది కానుకగా ప్రసారం కానుంది.
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా వచ్చి, సంక్రాంతి బరిలో దిగి వెండితెర పై సంచలనం సృష్టించిన చిత్రం '' గౌతమిపుత్ర శాతకర్ణి '' . . శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన బాలయ్య వందో చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామి సృష్టించింది.
ఒక తెలుగు వాడి చరిత్రను నలుగురికి తెలిసేలా చేసిన క్రిష్ కి, పాత్రలో నటించి మెప్పించిన బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపించారు దేశ,విదేసాభిమానులు . సంక్రాంతి కి రిలీజ్ అయిన శాతకర్ణి ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూల్ చేసి బాలయ్య చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . ఇక క్రిష్ పరంగా కూడా చూస్తే కమర్షియల్ హిట్ అందుకొని సత్తా చాటాడు.
ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా బుల్లితెరలో టెలికాస్ట్ చేయనున్నారని సమాచారం . మార్చి 29, 2017న ఈ చారిత్రిక చిత్రం సాయింత్రం ఆరు గంటలకు మాటీవిలో ప్రసారం కానుంది. ఆ తర్వాత మా మూవీస్ లో రార్తి తొమ్మిదిగంటలకు మరో షో పడనుంది. ఇలా ఒకే రోజు ఒక సంస్దకు చెందిన రెండు టీవి ఛానెల్స్ లో ప్రసారం కావటం రికార్డే.
మూడు నెలల కాలంలోనే బుల్లితెర పై వస్తుండటం బాలయ్య అభిమానులకు మాత్రమే కాకుండా బుల్లితెర ప్రేక్షకులు కూడా సంతోషించే విషయమే . తెలుగు వాడి సత్తా ఏంటో చాటిచెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి...టీఆర్పీల పరంగానూ రికార్డ్ లు క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు.
ఈ చిత్రంలో సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు అద్బతమై నిలిచాయి. శ్రేయ, హేమమాలనిలకు ఈ సినిమాతో మరోమారు మంచి పేరు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు బుల్లితెరపైన ప్రదర్శించనుండటంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పండుగ చేస్తున్నారు. వెండితరపై చూడడం మిస్ అయిన వాళ్లు బుల్లితెరపై చూసి ఎంజాయ్ చేయోచ్చు.