తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ టాక్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ సినిమా అంచనాలు మించి కలెక్షన్లను సాధిస్తున్నది. పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్ నటించిన ఈ సినిమా జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, దక్షిణాదిలో ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని వెంకట్ కే నారాయణ నిర్మించారు. ఈ చిత్రం తొలి వారాంతంలో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Advertisement

భగవంత్ కేసరి కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కథను తమిళ ప్రేక్షకులు, రాజకీయ నేపథ్యానికి అనుగుణంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్ పేలవంగా ఉండటంతో యూత్, క్రిటిక్స్ పెదవి విరిచారు. కానీ ఈ సినిమాను సాధారణ ప్రేక్షకుల ఆదరిస్తున్నారనే విషయం తాజా కలెక్షన్లతో స్పష్టమైంది.

Advertisement

జన నాయగన్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రిలీజ్ చేశారు. ఈ సినిమాను రికార్డు స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని కమీషన్ బేస్ మీద రిలీజ్ చేశారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 11 కోట్ల రూపాయల మేర నిర్ణయించారు. దాంతో ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణలో 11 కోట్ల షేర్, 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

ఈ సినిమా ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం తొలి రోజున 4.25 కోట్లు, రెండో రోజున 2 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2.05 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 4 రోజుల్లో ఈ సినిమా 10.4 కోట్ల రూపాయల నెట్, 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను నమోదు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.

ఈ సినిమా రిలీజ్ తర్వాత టాక్ సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. నైజాంలో ఈ చిత్రం 3.25 కోట్లు, ఆంధ్రాలో ఈ చిత్రం 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. ఇంకా కనీసం 6 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని తెలిపారు.

Advertisement

జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి ప్రధాన పాత్రల్లో తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.