తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్కే నిర్మించారు.
ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించారు. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ వివాదం కారణంగా పలుమార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన భగవంత్ కేసరి సినిమా ఆధారంగా రూపొందిన ఈ సినిమాను భారీ తారాగాణంతో నిర్మించారు. ఈ మూవీకి పనిచేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్ అన్నీ కలిపి 500 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు. ఈ సినిమా ఆలస్యం కావడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్, ఇతర వ్యయాలు కూడా పెరిగిపోయాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. విజయ్ సినిమాకు సాధారణంగానే భారీ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్కు తగినట్టుగానే భారీగా బిజినెస్ జరిగింది. రికార్డు స్థాయిలో బిజినెస్ క్లోజ్ కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం భారీగా పోటీ ఏర్పడింది. విజయ్ చివరి సినిమా కావడంతో పలు ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరంగా చేశాయి. ఈ సినిమా హక్కులను 115 కోట్లు చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకొన్నది. విజయ్ చిత్రాల్లో అత్యధిక రేటు పలికిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక సినిమా ఆడియో రైట్స్కు భారీగా డిమాండ్ కనిపించింది. ఈ సినిమా ఆడియో రైట్స్ 35 కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ నిర్మాణ సంస్థ, ఆడియో కంపెనీ టీ సిరీస్ దక్కించుకొన్నది. ఇక శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే ధర పలికింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా తమిళనాడు, కేరళ రైట్స్ 120 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఆంధ్రా, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 14 కోట్ల రూపాయల మేర జరిగింది. కన్నడ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ 6 కోట్ల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో థియేట్రికల్ వాల్యూ ఈ సినిమాకు 240 కోట్ల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. థియేట్రికల్ 240 కోట్లు, ఓటీటీ 115 కోట్లు, ఆడియో రైట్స్ 35 కోట్లు, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ సుమారుగా 25 కోట్లు రూపాయల మేర జరిగింది. దాంతో ఈ చిత్రం రిలీజ్కు ముందే 315 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్గా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 245 కోట్ల రూపాయల షేర్.. 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.More Articles